Andhra News: పైనచూస్తే తెల్లటి సంచులు.. డౌట్ వచ్చి విప్పి చూడగా.. దిమ్మతిరిగే సీన్

Date:

ఏపీలో మరోసారి భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు అల్లూరి జిల్లా పోలీసులు. రాష్ట్రంలో అక్రమ గంజాయి రవాణా సాగుతుందన్న విశ్వసనీయ వర్గాల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు..అల్లూరి జిల్లా పెదబయలు మండలం కుజుబంగి జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టి గంజాయి తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. నిందితుల నుంచి 1,373 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

అధికారుల కళ్లుగప్పి అక్రమంగా తరలిస్తున్న సుమారు 1,373కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలో అక్రమ గంజాయి రవాణా జరుగుతుందనే సమాచారంతో ఎస్పీ అమిత్ బర్దార్ పోలీసులకు కీలక దేశాలు జారీ చేశారు. ఎస్పీ ఆదేశాలతో అల్లూరి జిల్లా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానం ఉన్న చోట నిఘా పెంచ్చారు. అక్రమ గంజాయి రవాణా, సాగుపై పక్కడ్బంది ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.

అయితే ఇందులో భాగంగానే ముంచింగిపుట్టు పోలీసులు కుజభంగి జంక్షన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. అయితే అటుగా వెళ్తున్న ఓ బొలేరో వాహనంపై అనుమానం రావడంతో ఆపి క్షుణ్నంగా చెక్‌ చేశారు.అయితే అందులో తెల్లటి సంచులు ఉండగా.. వాటిని ఓపెన్ చేసి చూశారు. అంతే ఒక్కసారిగా గంజాయి వాసన గుప్పుమంది. మొత్తం 43 బస్తాల్లో భారీ మొత్తం గంజాయి ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. వారి నుంచి సుమారు1373.72 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని.. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

గంజాయి తరలిస్తున్న వ్యక్తులు ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. వీరు ఒడిస్సాలోని మల్కన్‌గిరి జిల్లా, చిత్రకొండ బ్లాక్ నుండి పెదబయలు మండలం జామిగూడ, రూడకోట మీదుగా వాహనం వస్తున్నట్టు గుర్తించారు. కాగా, ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొంతమంది నిందితులు పరారయ్యారు, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లాలో గంజాయి సాగు ఎక్కడా లేదని, అక్రమ రవాణాపై గౌరవ ఎస్పీ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు పోలీసులు. గంజాయి వల్ల జరిగే అనర్థాల గురించి వివరిస్తూ, యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....