Andhra News: అమ్మమ్మ అంత్యక్రియలకని వచ్చాడు.. కట్‌చేస్తే.. శ్మాశానంలోనే..

Date:

కాకినాడ జిల్లా యూ కొత్తపల్లి మండలం మూలపేట గ్రామ శ్మశాన వాటికలో ఒక దారుణ సంఘటన వెలుగుచూసింది. అమ్మమ్మ అంత్యక్రియల కోసం గ్రామానికి వచ్చిన యువకుడిపై కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతో.. తీవ్రంగా గాయపడిన యువకుడు హాస్పిటల్‌లో వెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయాడు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అమ్మమ్మ అంత్యక్రియలకు అని వచ్చిన ఓ యువకుడు.. ఆమెకు అంత్యక్రియలు జరుగుతున్న స్థలంలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన కాకినాడ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పెదపూడి మండలం ఏపీత్రయం గ్రామానికి చెందిన కాదా రాకేష్ అనే యువకుడు తన అమ్మమ్మ వేమగిరి రమణమ్మ చనిపోవడంతో.. ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఫ్యామిలీతో పాటు మూలపేట గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో గ్రామంలోని ఒక షాప్ వద్దకు రాకేష్ తన చెల్లితో వెళ్లగా, అక్కడ అతని చెల్లితో కొందరు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారు.

దీంతో ఆగ్రహానికి గురైన రాకేష్ వారితో వివాధానికి దిగాడు.. దీంతో వివాదం కాస్త పెద్దగా మారడంతో అతని చెల్లి పోలీసులకు 112కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గ్రామంలోని పెద్దలతో కలిసి సమస్యను సద్దుమనిగించారు. దీంతో ఎక్కడివాళ్లు అక్కడికి వెళ్లిపోయారు.

అయితే, ఈ గొడవ ఇంతటిలో ముగియలేదు.. స్మశాన వాటికలో అమ్మమ్మ అంత్యక్రియలు జరుగుతుండగా ఇరువర్గాల మధ్య మళ్లీ వివాదం మొదలైంది. ఇది కాస్తా తీవ్ర కొట్లాటకు దారి తీసింది. ఈ ఘర్షణలో ప్రత్యర్థులు రాకేష్‌పై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన రాకేష్‌ను హాస్పిటల్‌కు తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బాధితుడి కుటుంబం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....