మైథలాజికల్ టచ్‌తో ‘కురుక్షేత్రం’… నాని డైరెక్టర్‌తో బాలయ్య సరికొత్త ప్రయోగం?

Date:

నందమూరి బాలకృష్ణ తన నెక్ట్స్ మూవీని విలక్షణ దర్శకుడు వివేక్ ఆత్రేయతో చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోయే సినిమాకు ‘కురుక్షేత్రం’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం మైథాలజికల్ టచ్ ఉన్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని టాక్. గతంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘శ్రీ రామ రాజ్యం’ వంటి చిత్రాలతో పౌరాణిక, చారిత్రక పాత్రల్లో మెప్పించిన బాలయ్యకు, వివేక్ ఆత్రేయ సరికొత్త నెరేటివ్‌ను సిద్ధం చేశారు.

నందమూరి బాలకృష్ణ .. ఈ పేరు వింటేనే మాస్ ప్రేక్షకులకు పూనకాలు వచ్చేస్తాయి. వరుస విజయాల జోరులో ఉన్న బాలయ్య, తన తదుపరి చిత్రాల విషయంలో రూట్ మారుస్తున్నారు. ఒకవైపు గతంలో తనకు హిట్లు ఇచ్చిన దర్శకులతో మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూనే, మరోవైపు యంగ్ దర్శకులతో విభిన్నమైన ప్రయోగాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో బాలయ్య చేయబోయే సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

అంటే సుందరానికి’, ‘సరిపోదా శనివారం’ వంటి విలక్షణమైన కథలతో వివేక్ ఆత్రేయ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. అలాంటి దర్శకుడు మాస్ గాడ్ బాలయ్యతో జతకట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోయే చిత్రానికి ‘కురుక్షేత్రం’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ పేరు వినగానే నందమూరి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇది మాస్ యాక్షన్ సినిమానా లేక మైథాలజికల్ టచ్ ఉన్న కథా? అనే చర్చ నడుస్తోంది. బాలయ్యకు పౌరాణిక, చారిత్రక పాత్రలు పోషించడంలో సాటిలేని అనుభవం ఉంది. గతంలో ఆయన ‘శ్రీ రామ రాజ్యం’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చిత్రాలతో తన తండ్రి ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెట్టారు. ఇప్పుడు వివేక్ ఆత్రేయ మార్క్ విభిన్న కథనానికి, బాలయ్య మార్క్ గంభీరమైన డైలాగ్ డెలివరీ తోడైతే, వెండితెరపై మరో అద్భుతం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...