IRCTC Ayodhya Kashi Gaya Tour Package Telugu: అయోధ్య, కాశీ, గయ, ప్రయాగ్రాజ్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒకే యాత్రలో దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. బెంగళూరు నుంచి విమాన ప్రయాణంతో కొనసాగే ఈ 5 రోజుల యాత్రలో పలు ప్రముఖ క్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ఈ ప్యాకేజీ ధరలు ఒక్కొక్కరికి రూ.32,500 నుంచి ప్రారంభమవుతున్నాయి.

IRCTC Ayodhya Kashi Gaya Tour Package Telugu: ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లాలనుకునే భక్తుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయోధ్య, కాశీ, ప్రయాగ్రాజ్, గయ, బోధ్గయ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒకే యాత్రలో దర్శించుకునే అవకాశం ఈ ప్యాకేజీతో లభిస్తుంది. ‘హోలీ అయోధ్య విత్ గయ, కాశీ & ప్రయాగ్రాజ్ ఎక్స్ బెంగళూరు’ పేరుతో నిర్వహిస్తున్న ఈ టూర్లో బెంగళూరు నుంచి విమాన ప్రయాణం ఉంటుంది. మొత్తం 4 రాత్రులు/5 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది.
ప్రకటన
సెప్టెంబర్ 30న యాత్ర ప్రారంభం
2026 సెప్టెంబర్ 30న బెంగళూరు నుంచి ఈ ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభమవుతుంది. ఉదయం 10.30 గంటలకు బెంగళూరు నుంచి విమానం బయలుదేరి మధ్యాహ్నం 1.25 గంటలకు లక్నో చేరుకుంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అయోధ్యకు వెళ్లి హోటల్లో బస చేస్తారు.
అయోధ్య నుంచి ప్రయాగ్రాజ్.. ఆపై కాశీ
టూర్ రెండో రోజు ఉదయం అయోధ్యలోని ప్రముఖ రామ మందిరం, హనుమాన్ గఢీని దర్శించుకుంటారు. అనంతరం ప్రయాగ్రాజ్కు బయలుదేరి పవిత్ర త్రివేణి సంగమం, పాతాళపురి ఆలయాన్ని సందర్శిస్తారు. దర్శనాలు పూర్తయ్యాక వారణాసికి ప్రయాణించి అక్కడ రాత్రి బస చేస్తారు.
మూడో రోజు తెల్లవారుజామున కాశీ విశ్వనాథ ఆలయం, విశాలాక్షి ఆలయం, అన్నపూర్ణ ఆలయాలను దర్శించుకుంటారు. అనంతరం సాయంత్రం పవిత్ర గంగా నది తీరంలో జరిగే గంగా హారతిని వీక్షించే అవకాశం ఉంటుంది.
బోధ్గయ, గయ దర్శనం
నాలుగో రోజు ఉదయం అల్పాహారం తర్వాత బోధ్గయకు బయలుదేరుతారు. అక్కడ బౌద్ధులకు అత్యంత పవిత్రమైన మహాబోధి ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం హోటల్కు చేరుకుని బస చేస్తారు.
ఐదో రోజు ఉదయం గయలోని ప్రసిద్ధ విష్ణుపాద ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత పాట్నా విమానాశ్రయానికి బయలుదేరుతారు. రాత్రి 11.25 గంటలకు పాట్నా నుంచి బెంగళూరుకు విమానం బయలుదేరి, అక్టోబర్ 5న తెల్లవారుజామున 2 గంటలకు బెంగళూరు చేరుకోవడంతో ఐదు రోజుల ఆధ్యాత్మిక యాత్ర ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు
ఈ ప్యాకేజీలో ఒక్కొక్కరికి సింగిల్ ఆక్యుపెన్సీ రూ.43,200, డబుల్ ఆక్యుపెన్సీ రూ.34,600, ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ.32,500గా ధరలు ఉన్నాయి. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్తో రూ.32,300, బెడ్ లేకుండా రూ.30,200, 2 నుంచి 4 ఏళ్ల పిల్లలకు రూ.19,000 చార్జీగా నిర్ణయించారు.
ప్యాకేజీలో ఎకానమీ క్లాస్ విమాన టికెట్లు, నాలుగు రాత్రుల హోటల్ వసతి, అల్పాహారం, రాత్రి భోజనం, ఏసీ వాహనంలో స్థానిక రవాణా, దర్శన ఏర్పాట్లు, ట్రావెల్ ఇన్సూరెన్స్, జీఎస్టీ తదితర సదుపాయాలు ఉన్నాయి. అయితే ఆలయ ప్రవేశ రుసుములు, బోటింగ్, వ్యక్తిగత ఖర్చులు, గైడ్ సేవలు వంటి వాటికి అదనపు చార్జీలు వర్తిస్తాయి.
ఈ ప్యాకేజీలో మొత్తం 29 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి యాత్రను ప్లాన్ చేసుకునే వారు బుకింగ్కు ముందు ఐఆర్సీటీసీ వద్ద ప్యాకేజీ నిబంధనలు, విమాన సమయాలు, హోటల్ లభ్యత, తాజా ఛార్జీలను తప్పనిసరిగా నిర్ధారించుకోవడం మంచిది.
