
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉర్దూ మాధ్యమ విద్యార్థులు కూడా సమాన స్థాయిలో పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
విద్యార్థుల అభ్యాస నాణ్యత పెంపుతోపాటు పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఈ అధ్యయన సామగ్రి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
మైనారిటీ విద్యార్థుల విద్యాభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యతలో భాగమని మంత్రి ఫరూఖ్ చెప్పారు.


