తెలంగాణలోని మహిళలకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళా సంఘాలకు ఫెర్టిలైజర్ లైసెన్సులు అందించనుంది. గ్రామాల్లోని మహిళలను ఎంపిక చేసి ఎరువులు సరఫరా చేసే బాధ్యతలను అప్పగించనుంది. ఈ కార్యక్రమం అమలు కోసం ప్రణాళికలు రచిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళా సంఘాలకు ఎరువుల పంపిణీ బాధ్యతలను అప్పగించనుంది. రైతులకు ఎరువులు సరఫరా చేసే బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించనుంది. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో చురుగ్గా ఉన్న మహిళా సంఘాలను గుర్తించనుంది
వీరికి ఫెర్టిలైజర్ లైసెన్సులు అందించనుంది. రాష్ట్రంలో దాదాపు 4.67 లక్షల మహిళా సంఘాలు ఉన్నాయి. వీరిలో కొంతమందిని ఎంపిక చేసిన లైసెన్స్ అందించనున్నారు. అలాగే వీరికి యూరియా యాప్ వినియోగంపై ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు. మహిళా సంఘాల కోసం 8,126 సొంత భవనాలను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ కేంద్రాల్లోనే ఎరువులు నిల్వ చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు.

