80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳
మన అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ.. వారు కలలుగన్న సంపన్నమైన, శక్తివంతమైన భారతదేశ నిర్మాణంలో మన వంతు పాత్ర పోషిద్దాం.దేశ సంక్షేమం, అభ్యున్నతి, భద్రత, భవిష్యత్తు ప్రతి భారతీయుడికి అత్యంత ప్రాధాన్యతగా ఉండాలి. “దేశమే మొదట” అనే భావన ప్రతి పౌరుడి ఆలోచనలు, ఆచరణలో ప్రతిబింబించాలి.


2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం వైపు దేశం వేగంగా ముందుకు సాగుతున్న ఈ తరుణంలో.. ఐక్యత, బాధ్యత, దేశభక్తితో మరింత బలమైన భారతదేశ నిర్మాణానికి మనమంతా పునరంకితం కావాలి
ప్రజారాజధాని అమరావతి- రాయపూడి APCRDA ప్రధాన కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో APCRDA కమిషనర్ వి. విజయరామరాజు ఐఏఎస్, అడిషనల్ కమిషనర్లు, కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్, అభిషేక్ కుమార్ ఐఏఎస్, టి. రాహుల్ కుమార్ రెడ్డి ఐఏఎస్, APCRDAలోని వివిధ విభాగాల ముఖ్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో కమిషనర్, అడిషనల్ కమిషనర్లు..పతాకావిష్కరణ అనంతరం ఉద్యోగులకు సందేశాన్ని ఇచ్చారు.


