
ప్రాణాంతకమైన, క్యాన్సర్ ప్లాస్మా కణాలు “M ప్రోటీన్” అనే ఒక అసాధారణ యాంటీబాడీని ఉత్పత్తి చేస్తాయి. ఇది కణితి పెరుగుదల, మూత్రపిండాల దెబ్బతినడం, రోగనిరోధక శక్తి క్షీణించడం, అలాగే ఎముకలు నాశనం కావడం వంటి సమస్యల్ని సృష్టిస్తుంది. మల్టిపుల్ మైలోమా వ్యాపించడం మొదలై, క్యాన్సర్ కణాలు వృద్ధి చెందినప్పుడు, శరీరం సాధారణ ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్లకు స్థలాన్ని కోల్పోతుంది. ఇది క్రమంగా ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.
మీకు ఎప్పుడూ ఎముకల నొప్పి ఉందా? చిన్న చిన్న పనులకే అలసిపోతున్నారా? కాళ్ల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే, ఈ లక్షణాల్ని నిర్లక్ష్యం చేయకండి. ఇది మల్టీపుల్ మైలోమా కావచ్చు. మల్టీపుల్ మైలోమా అనేది ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. ఇది ఎముక మజ్జలో ఉండే ప్లాస్మా కణాలపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా ప్లాస్మా కణాలు మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి సాయపడతాయి
- కీలకమైన ఎముకల నొప్పి: నిరంతరం ఎముకల నొప్పి ఉండొచ్చు. ముఖ్యంగా వీపు లేదా పక్కటెముకల్లో దీర్ఘకాలంగా ఉండే ఎముకల నొప్పి.
- తీవ్రమైన అలసట: మైలోమా వల్ల ఎర్ర రక్తకణాలు తగ్గిపోతాయి. దీంతో శరీరం త్వరగా అలసిపోతుంది. అంటే చిన్న చిన్న పనులకే అలసిపోవడం జరుగుతుంది.
- తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం: ఈ క్యాన్సర్ దెబ్బకి ఇమ్యూనిటీ పవర్ బలహీనపడుతుంది. దీంతో, ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది.
- రక్తస్రావం లేదా సులభంగా కమిలిపోవడం: చిన్న దెబ్బలకే శరీరంపై నల్లటి మచ్చలు పడతాయి. లేదా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది.
- కిడ్నీ సమస్యలు: మూత్రపిండాల పనితీరు మందగిస్తుంది.
- శరీరంలో బలహీనత లేదా తిమ్మిర్లు: నరాలు నొక్కబడటం వల్ల చేతులు, కాళ్ళలో తిమ్మిర్లు రావడం.
- ఇతర కాంప్లికేషన్లు: ఎముకలు త్వరగా విరిగిపోవడం, రక్తంలో కాల్షియం స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి

